తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
ABN , First Publish Date - 2022-06-27T13:39:14+05:30 IST
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 88,613 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.24 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 36,153 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.