తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2022-07-01T13:37:16+05:30 IST
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. గురువారం 65,898 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.66 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 33,686 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.