తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2022-08-15T14:00:05+05:30 IST
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి.. క్యూ లైన్ వెలుపలికి భక్తులు వచ్చారు.
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి.. క్యూ లైన్ వెలుపలికి భక్తులు వచ్చారు. శ్రీవారి సర్వ దర్శనానికి 36 గంటల సమయం పడుతోంది. ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 92,328 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.36 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. 52,969 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.