తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-10-06T13:35:38+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. మంగళవారం తిరుమల శ్రీవారిని 63,579 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.95 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 34,524 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.  

Updated Date - 2022-10-06T13:35:38+05:30 IST