తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
ABN , First Publish Date - 2022-10-07T14:11:44+05:30 IST
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 63,332 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.86 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 26,656 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.