తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

ABN , First Publish Date - 2022-08-17T13:46:43+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి భక్తులు 30 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. మంగళవారం తిరుమల శ్రీవారిని 72,851 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.73 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న శ్రీవారికి 34,404 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.


Updated Date - 2022-08-17T13:46:43+05:30 IST