Tirumala: శ్రీవారి సేవలో మంత్రులు

ABN , First Publish Date - 2022-07-24T01:48:39+05:30 IST

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని శనివారం ఇద్దరు మంత్రులు దర్శించుకున్నారు. వీరిలో.. విడుదల రజని, గుడివాడ అమర్‌నాథ్‌

Tirumala: శ్రీవారి సేవలో మంత్రులు

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని శనివారం ఇద్దరు మంత్రులు దర్శించుకున్నారు. వీరిలో.. విడుదల రజని, గుడివాడ అమర్‌నాథ్‌ ఉన్నారు. అలాగే రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కుంభా రవిబాబు, ఎయిటెల్‌ సంస్థ డైరెక్టర్‌ సునీల్‌కుమార్‌ తాల్ధర్‌ కూడా స్వామి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూప్రసాదాలు అందజేశారు. మరోవైపు తిరుమల వేంకటేశ్వర స్వామి (Tirumala Venkateswara Swamy) హుండీ కానుకలతో కళకళలాడుతోంది. టీటీడీ (TTD) చరిత్రలో శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. శ్రీవారి భక్తులు (Devotees) కాసుల వర్షం కురిపించారు. ఈనెల రూ. 100 కోట్ల ఆదాయం దాటింది. కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున తిరుమలకు భక్తులు వస్తున్నారు. శ్రీవారిని దర్శించుకుని విరివిగా కానుకలు సమర్పించుకుంటున్నారు.

Updated Date - 2022-07-24T01:48:39+05:30 IST