తిరుమలలో భక్తులు తీవ్ర ఇక్కట్లు.. దర్శన టికెట్ల కోసం బారులు

ABN , First Publish Date - 2021-07-28T22:55:39+05:30 IST

తిరుమలలో భక్తులు తీవ్ర ఇక్కట్లు.. దర్శన టికెట్ల కోసం బారులు

తిరుమలలో భక్తులు తీవ్ర ఇక్కట్లు.. దర్శన టికెట్ల కోసం బారులు

తిరుమల: శ్రీవారి దర్శన టికెట్ల కోసం భక్తులు ఎగబడుతున్నారు. నేటి నుంచి వచ్చే 31 వరకు అదనంగా మరో మూడు వేల ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. అయితే ఉదయం 10 గంటల నుంచే భక్తులు టికెట్ల కొనుగోలుకు కంప్యూటర్ల వద్ద ఉన్నారు. ఎంతకీ టికెట్లు విడుదల కాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. దీనిపై టీటీడీ ఐటీ విభాగాన్ని సంప్రదించగా సాంకేతిక సమస్య కారణంగా ప్రత్యేక దర్శనం టికెట్ల కోటా విడుదల చేయాలని తెలిపారు. యుద్ధ ప్రతిపాదికన మరమ్మతు పనులు జరుగుతున్నాయని, వెంటనే టికెట్లను జారీ చేస్తామని చెప్పారు. దీంతో స్వామివారి  దర్శనం టికెట్లు పొందేందుకు భక్తులు కంప్యూటర్ల వద్దే వేచి ఉన్నారు. 



Updated Date - 2021-07-28T22:55:39+05:30 IST