తిరుపతిలో కిలాడీ లేడి సుహాసిని అరెస్ట్
ABN , First Publish Date - 2021-07-14T14:22:15+05:30 IST
పెళ్లి పేరుతో పలువురిని మోసం చేసిన కిలాడీ లేడీ సుహాసినిని అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు.
తిరుపతి: పెళ్లి పేరుతో పలువురిని మోసం చేసిన కిలాడీ లేడీ సుహాసినిని అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యనారాయణపురంలో ఉంటున్న సునీల్ కుమార్ను పెళ్ళి చేసుకున్న సుహాసిని...అతడి ఇంట్లోని బంగారు, నగదుతో ఉండాయించింది. నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లుతో సుహాసినికి ఇది వరకే వివాహమై ఒక కుమార్తె ఉన్నట్లు అలిపిరి పోలీసులు గుర్తించారు.