Tirupati: మాజీ రౌడీషీటర్ పై ప్రత్యర్థులు కత్తులతో దాడి
ABN , First Publish Date - 2021-08-04T16:32:47+05:30 IST
స్తి తగాదాల నేపథ్యంలో మాజీ రౌడీషీటర్ పై ప్రత్యర్థులు కత్తులతో దాడికి దిగారు. దీంతో రౌడీషీటర్ బుల్లెట్ విశ్వనాథ్ ప్రాణభయంతో గోవిందరాజు స్వామి ఆలయంలోకి పరుగులు
తిరుపతి: ఆస్తి తగాదాల నేపథ్యంలో మాజీ రౌడీషీటర్ పై ప్రత్యర్థులు కత్తులతో దాడికి దిగారు. దీంతో రౌడీషీటర్ బుల్లెట్ విశ్వనాథ్ ప్రాణభయంతో గోవిందరాజు స్వామి ఆలయంలోకి పరుగులు తీశాడు. టీటీడీ సెక్యూరిటీ సహాయంతో తీవ్ర గాయాలైన రౌడీషీటర్ను రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.