Tirupati: భూదేవి కాంప్లెక్స్ వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-04-12T13:31:33+05:30 IST

తిరుపతిలో ఉచిత దర్శనం టోకెన్లు ఇచ్చే భూదేవి కాంప్లెక్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Tirupati: భూదేవి కాంప్లెక్స్ వద్ద ఉద్రిక్తత

తిరుపతి: తిరుపతిలో ఉచిత దర్శనం టోకెన్లు ఇచ్చే భూదేవి కాంప్లెక్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీవారికి దర్శనం కోసం వేలాదిగా  భక్తులు తిరుమలకు తరలివచ్చారు. భక్తుల రద్దీ తీవ్రం కావడంతో భక్తులపై టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించింది. చిన్నపిల్లలతో వచ్చినవాళ్లు తోపులాటలో చిన్నపిల్లలు గాయపడుతుండటంతో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 20 సంవత్సరాలలో ఎప్పుడూ ఇంత దారుణమైన పరిపాలన చూడలేదని భక్తులు మండిపడుతున్నారు. 

Updated Date - 2022-04-12T13:31:33+05:30 IST