తిరుపతి విష్ణు నివాసం వద్ద కొవిడ్ బాధితుల ధర్నా

ABN , First Publish Date - 2022-01-20T17:40:48+05:30 IST

తిరుపతి విష్ణు నివాసం వద్ద కొవిడ్ బాధితులు మరోసారి ధర్నాకు దిగారు.

తిరుపతి విష్ణు నివాసం వద్ద కొవిడ్ బాధితుల ధర్నా

తిరుపతి: తిరుపతి విష్ణు నివాసం వద్ద కొవిడ్ బాధితులు మరోసారి ధర్నాకు దిగారు. ఆహారం సరిగ్గా లేదని, పురుగులున్న ఆహారం తమకు వద్దని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు.  వందలాది మంది రోగులు మెయిన్ గేట్ వద్దకు చేరుకున్నారు. రెండు రోజుల క్రితం రాత్రి ఆహారం సరిగ్గా లేదని ధర్నా చేశారు... అయినా పట్టించుకోని అధికారుల తీరుపై రోగుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రెండు వేవుల్లో ఆహారం తదితరులు సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు  ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. దీనితో నాణ్యమైన ఆహారం సరఫరా చేసే కాంట్రాక్టర్లు ఈసారి ముందుకు రాని పరిస్థితి నెలకొంది.  ఓ పార్టీకి చెందిన నేతలు టెండర్ దక్కించుకున్నారు. దీంతో నాసిరకం ఆహారం పెడుతున్నప్పటికీ అడిగే ధైర్యం లేక అధికారులు మిన్నుకుండిపోయారు. ఈ క్రమంలో కొవిడ్ రోగులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. 

Updated Date - 2022-01-20T17:40:48+05:30 IST