పిలేరులో పవన్ కల్యాణ్ అభిమానులపై పోలీస్ కేసు
ABN , First Publish Date - 2022-03-08T17:04:34+05:30 IST
నగరంలోని పీలేరులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులపై పోలీస్ కేసు నమోదు అయ్యింది.
తిరుపతి: నగరంలోని పీలేరులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులపై పోలీస్ కేసు నమోదు అయ్యింది. పవన్ నటించిన ‘‘భీమ్లానాయక్’’ సినిమా విడుదల రోజు పిలేరులో థియేటర్ వద్ద అభిమానులు మేక పోతును బలి ఇచ్చారు. జంతు బలి దృశ్యాలు అభిమానులు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ట్విట్టర్లో వీడియోను పోలీసులకు పంపిన ఓ న్యాయవాది... అభిమానులపై చర్య తీసుకోవాలని కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.