Tirupati: కూల్‌డ్రింక్‌‎లో మత్తుమందు కలిపి అత్యాచారాం

ABN , First Publish Date - 2021-07-31T12:33:24+05:30 IST

నమ్మించి... మత్తు మందిచ్చి.. ఓ యువతి (19)పై ఇద్దరు బిడ్డల తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. అలిపిరి సీఐ దేవేంద్రకుమార్‌ తెలిపిన ప్రకారం.. ఓ యువతి తండ్రి ఏడేళ్ల కిందట...

Tirupati: కూల్‌డ్రింక్‌‎లో మత్తుమందు కలిపి అత్యాచారాం

తిరుపతి: నమ్మించి... మత్తు మందిచ్చి.. ఓ యువతి (19)పై ఇద్దరు బిడ్డల తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. అలిపిరి సీఐ దేవేంద్రకుమార్‌ తెలిపిన ప్రకారం.. ఓ యువతి తండ్రి ఏడేళ్ల కిందట ప్రమాదంలో మృతిచెందాడు. తల్లి అనారోగ్యంతో రెండేళ్లక్రితం చనిపోయింది. దీంతో కుటుంబ స్నేహితుడు, మంగళం బీటీఆర్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఆమె జీవనం సాగిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన నాగేంద్రబాబు తనపై అత్యాచారానికి పాల్పడ్డట్టు ఆ యువతి అలిపిరి పోలీసులకు శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేసింది. 28వ తేదీ తనకు మాయమాటలుచెప్పి శ్రీనివాసం సమీపంలోని ఓ లాడ్జికి నాగేంద్రబాబు తీసుకెళ్లాడని, మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ ఇచ్చి.. అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సీఐ దేవేంద్రకుమార్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నాగేంద్రబాబుకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ చెప్పారు. 

Updated Date - 2021-07-31T12:33:24+05:30 IST