స్విమ్స్లో వ్యాక్సిన్ కేంద్రాన్ని సందర్శించిన Kishan reddy
ABN , First Publish Date - 2021-08-19T14:57:34+05:30 IST
తిరుపతిలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి పర్యటన కొనసాగుతోంది.
తిరుపతి: తిరుపతిలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి పర్యటన కొనసాగుతోంది. గురువారం ఉదయం స్విమ్స్ ఆసుపత్రిలో కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కేంద్ర మంత్రి సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల సహకారంతోనే కరోనాను జయించగలిగామన్నారు. థర్డ్ వేవ్పై ఆందోళన వద్దని..నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. త్వరలో 130 కోట్ల మంది భారతీయులకు వ్యాక్సినేషన్ పూర్తవుతుందని తెలిపారు. దేశంలో వేగంగా వ్యాక్యినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. వ్యాక్సినేషన్ను ప్రపంచ దేశాలు ఆశ్చర్యంగా చూస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు.