ఎన్నికల నిలిపివేత సరికాదు

ABN , First Publish Date - 2021-03-06T09:23:26+05:30 IST

తిరుపతి ఏడో డివిజన్‌లో ఎన్నికలను నిలిపివేస్తూ ఈ నెల 4న రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎ్‌సఈసీ) ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఆ డివిజన్‌లో నామినేషన్‌ వేసిన అభ్యర్థి

ఎన్నికల నిలిపివేత సరికాదు

హైకోర్టును ఆశ్రయించిన తిరుపతి ఏడో డివిజన్‌ అభ్యర్థి


అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): తిరుపతి ఏడో డివిజన్‌లో ఎన్నికలను నిలిపివేస్తూ ఈ నెల 4న రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎ్‌సఈసీ) ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఆ డివిజన్‌లో నామినేషన్‌ వేసిన అభ్యర్థి సీహెచ్‌.సుజాత హైకోర్టులో శుక్రవారం అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశా రు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు ఎస్‌ఈసీ పూర్తి వివరాలు సమర్పించేందుకు విచారణను సో మవారానికి వాయిదా వేశారు. తిరుపతి ఏడో డివిజన్‌ టీడీపీ అభ్యర్ధి ఎం. విజయలక్ష్మి తన సంతకాన్ని ఫోర్జరీ చేసి.. తనకు తెలియకుండా నామినేషన్‌ ఉససంహరించుకున్నారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేయించిన ఎస్‌ఈసీ.. సంబంధిత డివిజన్‌లో ఎన్నికను నిలిపివేశారు.

Updated Date - 2021-03-06T09:23:26+05:30 IST