Tirupati: రెండో రోజుకు జనాగ్రహ దీక్ష

ABN , First Publish Date - 2021-10-22T15:59:10+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ నేతలు చేపట్టిన జనాగ్రహ దీక్ష రెండో రోజుకు చేరుకుంది.

Tirupati: రెండో రోజుకు జనాగ్రహ దీక్ష

తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ నేతలు చేపట్టిన  జనాగ్రహ దీక్ష రెండో రోజుకు చేరుకుంది. దీక్షలో ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి, మేయర్ శిరీష పాల్గొన్నారు. రెండో రోజు  వైసీపీ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. చంద్రబాబు దిష్టి బొమ్మకు శవయాత్ర నిర్వహించారు. జనాగ్రహ దీక్ష శిబిరం ఎదురుగా శవ యాత్ర నిర్వహించిన వైసీపీ నేతలు అనంతరం శిబిరం ఎదుట దహనక్రియలు నిర్వహించారు. 

Updated Date - 2021-10-22T15:59:10+05:30 IST