ఆధిపత్యం నిలుపుకున్న మమత.. బెంగాల్‌లో క్లీన్‌స్వీప్

ABN , First Publish Date - 2021-11-02T22:35:23+05:30 IST

ఉప ఎన్నికల ఫలితాల్లో కూడా టీఎంసీ అద్భుత విజయం సాధించింది. మొత్తం నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల జరగ్గా నాలుగు స్థానాల్లోనూ టీఎంసీ అభ్యర్థులే విజయం సాధించారు. దింహాతా నుంచి ఉదయాన్ గుహ, గోసాబా నుంచి సుబ్రతో మండల్, ఖార్దాహా నుంచి సోభానందేబ్ సహోపాధ్యాయ్..

ఆధిపత్యం నిలుపుకున్న మమత.. బెంగాల్‌లో క్లీన్‌స్వీప్

కోల్‌కతా: కొంత కాలం క్రితం జరిగి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 292 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీ ఏకంగా 215 స్థానాలు గెలుచుకుంది. అయితే ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓడిపోవడం గమనార్హం. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ టీఎంసీ క్లీన్ స్వీప్ చేసింది. అంతే కాకుండా బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలను టీఎంసీలో చేర్చుకుంటున్నారు.


తాజాగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో కూడా టీఎంసీ అద్భుత విజయం సాధించింది. మొత్తం నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల జరగ్గా నాలుగు స్థానాల్లోనూ టీఎంసీ అభ్యర్థులే విజయం సాధించారు. దింహాతా నుంచి ఉదయాన్ గుహ, గోసాబా నుంచి సుబ్రతో మండల్, ఖార్దాహా నుంచి సోభానందేబ్ సహోపాధ్యాయ్, శాంతిపూర్ నుంచి బ్రజా కిశోర్ గోస్వామి గెలుపొందారు. కాగా, ఫలితాలు రావడానికి ముందే టీఎంసీ అధినేత మమతా బెనర్జీ నాలుగు స్థానాల్లో తమదే విజయం అని ప్రకటించడం గమనార్హం.

Updated Date - 2021-11-02T22:35:23+05:30 IST