ఇళ్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి
ABN , First Publish Date - 2020-10-27T09:29:35+05:30 IST
గత ప్రభుత్వ హయాంలో నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని సీపీఐ మండల కార్యదర్శి ఎం.వెంకటాచారి డిమాండ్ చేశారు.
కుక్కునూరు, అక్టోబరు 26 : గత ప్రభుత్వ హయాంలో నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని సీపీఐ మండల కార్యదర్శి ఎం.వెంకటాచారి డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాల యం ఎదుట సీపీఐ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇళ్ల పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేస్తుందని విమర్శించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి ఎం.వెంకటాచారి, జిల్లా కమిటీ సభ్యులు అయితా సురేశ్, కె.బాబూరావు, పాపారావు, నాగరాజు పాల్గొన్నారు.