శ్మశాన పాట్లు

ABN , First Publish Date - 2020-10-27T09:27:14+05:30 IST

అంత్య క్రియలు నిర్వహించేందుకు పోల వరం గ్రామస్థులకు ఇ బ్బందులు తప్పడం లే దు.

శ్మశాన పాట్లు

అంత్యక్రియలకు పోలవరం వాసుల వెతలు


పోలవరం, అక్టోబరు 26 : అంత్య క్రియలు  నిర్వహించేందుకు పోల వరం గ్రామస్థులకు ఇ బ్బందులు తప్పడం లే దు. సోమవారం పోలవ రం పంచాయతీ యడ్ల గూడెంలో ఏకకాలంలో ఇద్దరు వృద్ధ మహిళలు చనిపోవడంతో వారి మృత దేహాలను ఖననం చేసేందుకు ఎన్నో అవస్థలకు గురయ్యారు. పోలవరానికి గోదావరి వరదల నుంచి రక్షణగా యడ్లగూడెం నుంచి పాతపోలవరం వరకు 20 అడుగుల ఎత్తున 2009లో నిర్మించిన నక్లెస్‌బండ్‌ వల్ల ఎవరైన కాలం చేస్తే నక్లెస్‌బండ్‌కు మృతదేహంతో ఎక్కి నదీ తీరానికి దిగడానికి మృతుల బంధువులు, గ్రామస్థులు అవస్థలకు గురవుతున్నారు. ఇక క్రిస్టియన్‌, ముస్లింల శ్మశానాలు ఇటీవల వర్షాలకు నీట మునిగాయి. అధికారులు స్పం దించి వరద సమయాల్లో వినియోగించుకునేందుకు ప్రత్యేక శ్మశాన స్థలం కేటాయించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - 2020-10-27T09:27:14+05:30 IST