సీఎం జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: Pranv gopal

ABN , First Publish Date - 2021-10-24T18:19:00+05:30 IST

ముఖ్యమంత్రిపై టీడీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయలేదని తేలిపోయిందని ఏపీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ప్రణవ్ గోపాల్ అన్నారు.

సీఎం జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: Pranv gopal

విశాఖపట్నం: ముఖ్యమంత్రిపై  టీడీపీ నాయకులు  అనుచిత వ్యాఖ్యలు చేయలేదని తేలిపోయిందని ఏపీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ప్రణవ్ గోపాల్ అన్నారు. టీడీపీ నాయకులు తనను దుర్బాషలాడారని చేసిన ముఖ్యమంత్రి ప్రకటన పూర్తిగా అవాస్తవమని ప్రజలు గ్రహించారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ తక్షణమే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఆఫీసులపై జరిగిన దాడులకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల దృష్టిని మరల్చేందుకే జనాగ్రహ దీక్షలు పెట్టి మంత్రులు దిజారి దుర్బాషలాడారని మండిపడ్డారు. గుడివాడ అమర్ ఓ ఆకు రౌడీ అని.. మంత్రి పదవి కోసం దిగజారి మాట్లాడుతున్నారన్నారు. 72 గంటలలో ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల నివాసాలు ముట్టడిస్తామని ప్రణవ్ గోపాల్ హెచ్చరించారు. 

Updated Date - 2021-10-24T18:19:00+05:30 IST