నిరుద్యోగులను మోసం చేసిన సీఎం

ABN , First Publish Date - 2021-06-22T05:30:00+05:30 IST

ప్రతి సంవత్సరం లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేస్తున్నారని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌కు వ్యతిరేకంగా నగరంలోని వీఆర్సీ కూడలిలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.

నిరుద్యోగులను మోసం చేసిన సీఎం
నిరసన తెలుపుతున్న టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు.

టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో జాబ్‌ క్యాలెండర్‌ దహనం

నెల్లూరు(వెంకటేశ్వరపురం) జూన్‌ 22 : ప్రతి సంవత్సరం లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేస్తున్నారని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌కు వ్యతిరేకంగా నగరంలోని వీఆర్సీ కూడలిలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. జాబ్‌ క్యాలెండర్‌ పత్రాలను దహనం చేశారు. అనంతరం ప్రవీణ్‌ మాట్లాడుతూ లక్షలాది మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే జీవో నెంబర్‌ 39 ద్వారా కేవలం 10 వేల ఉద్యోగాలు మాత్రమే విడుదల చేయడం అన్యామన్నారు. ఇలా మోసం చేస్తే రానున్న రోజుల్లో నిరుద్యోగులు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెపుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నవీన్‌, సాఖేష్‌వర్దన్‌రెడ్డి , మణికంఠ, సుకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T05:30:00+05:30 IST