గురువులను పూజించినపుడే ఉన్నతస్థాయికి
ABN , First Publish Date - 2021-07-25T05:22:29+05:30 IST
మండలంలోని మునగలపాళెం జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం సందడిగా ప్రతిభావంతుల సమావేశం జరిగింది.
ఏర్పేడు, జూలై 24: మండలంలోని మునగలపాళెం జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం సందడిగా ప్రతిభావంతుల సమావేశం జరిగింది. ఇదే పాఠశాలలో టెన్త్ చదివిన ప్రతిభావంతులైన విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ గురువులను పూజించినపుడే విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకుంటారని సూచించారు. అనంతరం విశ్రాంత ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ మంజుభార్గవి, హెచ్ఎం వేణుగోపాల్, నాయకులు కిషోర్రెడ్డి, మోహన్నాయుడు, తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు.