జవాబుదారీగా ఉండాలి

ABN , First Publish Date - 2021-03-07T05:30:00+05:30 IST

ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న పనులకు చెల్లించే ప్రతి పైసాకు ఇంజినీర్లు జవాబుదారీగా ఉండాలని పంచాయతీరాజ్‌ డిప్లమో ఇంజినీర్ల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు జి.హనుమంతరావు సూచించారు. ఆదివారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా అధ్యక్షుడు కేసీహెచ్‌ మహంతి అధ్యక్షతన అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

జవాబుదారీగా ఉండాలి

డిప్లమో ఇంజినీర్ల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు

గుజరాతీపేట : ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న పనులకు చెల్లించే ప్రతి పైసాకు ఇంజినీర్లు జవాబుదారీగా ఉండాలని పంచాయతీరాజ్‌ డిప్లమో ఇంజినీర్ల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు జి.హనుమంతరావు సూచించారు. ఆదివారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా అధ్యక్షుడు కేసీహెచ్‌ మహంతి అధ్యక్షతన  అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లా డుతూ, ఉపాధి పనులుపై ప్రభుత్వం కమిటీలు వేసి తద్వారా ముందుకు వెళ్లాలే తప్పా ఇంజినీర్లపై ఒత్తిడి తేవడం సరికాద న్నారు.  ఇదే పరిస్థితి కొనసాగితే ఇంజినీరింగ్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) కార్యాలయం ఎదుట ఆందళన చేపట్టేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. సమావేశంలో అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి కె.రవీంద్ర,  ప్రధాన కార్యదర్శి ఎస్‌వీఏ పోలినాయుడు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2021-03-07T05:30:00+05:30 IST