సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2020-11-26T05:56:04+05:30 IST
సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండా లని వైద్యఆరోగ్యశాఖ అధికారులు సూచించారు.
కామారెడ్డిటౌన్, నవంబరు 25: సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండా లని వైద్యఆరోగ్యశాఖ అధికారులు సూచించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రధాన రహదారుల వెంట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దోమలు వృద్ధి చెందకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు కాచిచల్లా ర్చిన నీటిని తాగాలని తెలిపారు. పిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధిత వ్యాధిగ్రస్తులు జాగ్రత్త వహించాలన్నారు. కార్యక్రమంలో సంజీవరెడ్డి, రాణి, విఠల్రావు పాల్గొన్నారు.