నేడు నాలుగు మునిసిపాల్టీల్లో కౌన్సిలర్లకు నామినేషన్లు

ABN , First Publish Date - 2021-02-28T07:11:33+05:30 IST

మునిసిపల్‌ ఎన్నికలకు సంబంధించి గతంలో ఆయా మునిసిపాల్టీల్లో వివిధ రాజకీయ పార్టీల తరపున నామినేషన్లు వేసి, తర్వాత మరణించిన వారి స్థానాల్లో ఆదివారం నామినేషన్లు స్వీకరించనున్నారు.

నేడు నాలుగు మునిసిపాల్టీల్లో   కౌన్సిలర్లకు నామినేషన్లు

మృతి చెందిన వారి స్థానాల్లో స్వీకరణ

కాకినాడ, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నికలకు సంబంధించి గతంలో ఆయా మునిసిపాల్టీల్లో వివిధ రాజకీయ పార్టీల తరపున నామినేషన్లు వేసి, తర్వాత మరణించిన వారి స్థానాల్లో ఆదివారం నామినేషన్లు స్వీకరించనున్నారు. రామచంద్రపురం మునిసిపాల్టీలో గతంలో నామినేషన్‌ వేసినవారు ఇద్దరు మృతి చెందారు. తుని మునిసిపాల్టీలో ఒకరు, గొల్లప్రోలు, ఏలేశ్వరం నగర పంచాయతీలో ఒక్కొక్కరు మొత్తం ఐదుగురు మృతి చెందారు. గతంలో ఏ పార్టీ నుంచి అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారో, అదే పార్టీ నుంచి కొత్తగా అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేయడానికి మధ్యాహ్నం మూడు గంటల వరకు షెడ్యూల్‌ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ గడువు ఇచ్చింది.


Updated Date - 2021-02-28T07:11:33+05:30 IST