మరిదికి తన చెల్లిని ఇచ్చి పెళ్లి చేసిన మహిళ.. కొద్ది రోజుల తర్వాత అసలు విషయం బయటపడడంతో..

ABN , First Publish Date - 2022-04-18T20:47:20+05:30 IST

ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు ఎన్నో దారుణాలకు కారణమవుతున్నాయి.

మరిదికి తన చెల్లిని ఇచ్చి పెళ్లి చేసిన మహిళ.. కొద్ది రోజుల తర్వాత అసలు విషయం బయటపడడంతో..

ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు ఎన్నో దారుణాలకు కారణమవుతున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో పడిన కొందరు కడుపున పుట్టిన పిల్లలను కూడా చంపుకుంటున్నారు.. కుటుంబ సభ్యులను మోసం చేస్తున్నారు. తాజాగా గుజరాత్‌లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. మరిదితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ తన స్వంత చెల్లెలి జీవితాన్నే బలి చేసింది. 


అహ్మదాబాద్ సబర్బన్ మణినగర్‌కు చెందిన ఓ మహిళ తన భర్త తమ్ముడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కుటుంబ సభ్యులు అతడికి పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు. దీంతో ఆ మహిళ తన మరిది తనకు దూరం కాకుండా ఉండేందుకు ఓ పథకం వేసింది. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి స్వయానా తన చెల్లెలిని మరిదికి ఇచ్చి పెళ్లి చేసింది. అయితే పెళ్లి తర్వాత అత్తింటికి వచ్చిన కొత్త కోడలికి విషయం కొద్ది రోజుల్లోనే అర్థమైంది.


తన భర్తతో అక్క వివాహేతర సంబంధం పెట్టుకుందని బావగారికి చెప్పినా అతను పట్టించుకోలేదు. కుటుంబ సభ్యులకు చెబితే.. ఫ్యామిలీ పరువు పోతుందని వారు ఆమెను వారించారు. దీంతో ఆమె అభయం హెల్ప్ లైన్‌ను ఫోన్ చేసి తన గోడు వెళ్లబోసుకుంది. దీంతో అభయం హెల్ప్ లైన్‌ కౌన్సిలర్లు కుటుంబం మొత్తానికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 

Updated Date - 2022-04-18T20:47:20+05:30 IST