తాగుడు మానేయమన్నందుకు..

ABN , First Publish Date - 2020-11-27T04:50:14+05:30 IST

తాగుడికి బానిసకావడంతో మానేయాలని భార్య తన భర్త ను మందలించడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.

తాగుడు మానేయమన్నందుకు..

భార్య మందలించడంతో భర్త ఆత్మహత్య

బీర్కూర్‌, అక్టోబరు 26: తాగుడికి బానిసకావడంతో మానేయాలని భార్య తన భర్తను మందలించడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బీర్కూర్‌ మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ రాల ప్రకారం.. బీర్కూర్‌కు చెందిన ఉప్పు రాములు(37) మద్యానికి బానిసయ్యాడు. తరుచూ తాగుతూ భార్య సావిత్రితో గొడవపడేవాడు. మద్యం మానేయాలని ఎన్నిసా ర్లు చెప్పినా ఫలితం లేదు. మంగళవారం ఫుల్‌గా మద్యం తాగి గాంధీచౌక్‌లో పడిపో వడంతో స్థానికులు, సోదరుడు సాయిలు సహాయంతో భర్తను ఇంటికి తీసుకొచ్చింది. బుధవారం ఉదయం మద్యం మానివేయాలని భర్తను హెచ్చరించింది. దీంతో రా ములు మనస్థాపానికి గురయ్యాడు. సావిత్రి, సాయిలు పొలం పనులకు వెళ్లారు. రా ములు కూతురు పక్కింట్లో ఆడుకునేందుకు వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంట్లో దూలానికి ఉరి వేసుకున్నాడు. పొలం పనులు ముగించుకుని సావిత్రి, సాయి లు ఇంటికి రాగా రాములు దూలానికి వేలాడుతున్నాడు. భార్య సావిత్రి ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్‌ వర్మ తెలిపారు. అనం తరం మృతదేహాన్ని పోస్టుమార్టానికి బాన్సువాడ ఏరియాస్పత్రికి తరలించారు.

Updated Date - 2020-11-27T04:50:14+05:30 IST