నేడు కేరళ సీఎంతో స్టాలిన్‌ భేటీ

ABN , First Publish Date - 2022-09-02T13:04:52+05:30 IST

ముల్లై పెరియార్‌ డ్యామ్‌ వ్యవహారంలో కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌(Kerala State Chief Minister Pinarayi Vijayan)తో రాష్ట్ర

నేడు కేరళ సీఎంతో స్టాలిన్‌ భేటీ

అడయార్‌(చెన్నై), సెప్టెంబరు 1: ముల్లై పెరియార్‌ డ్యామ్‌ వ్యవహారంలో కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌(Kerala Chief Minister Pinarayi Vijayan)తో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శుక్రవారం భేటీ కానున్నారు. ఇందుకోసం సీఎం స్టాలిన్‌ తిరువనంతపురం వెళ్ళనున్నారు. సదరన్‌ రీజియన్‌ కౌన్సిల్‌ 30వ భేటీ తిరువనంతపురం వేదికగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నేతృత్వంలో ఈ నెల 3వ తేదీ జరుగనుంది. ఇందులో తమిళనాడు, కేరళ, కర్నాటక, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అండమాన్‌ అండ్‌ నికోబార్‌, లక్ష్య దీవుల ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ కౌన్సిల్‌ సదస్సులో పాల్గొనేందుకు సీఎం స్టాలిన్‌(CM Stalin) ఒక రోజు ముందుగానే అక్కడకు వెళుతున్నారు. అక్కడ తమిళనాడు, కేరళ రాష్ట్రాల మధ్య ప్రధాన సమస్యగా ఉన్న ముల్లై పెరియార్‌ డ్యామ్‌ వ్యవహారంతో పాటు ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఇతర సమస్యలపై చర్చించనున్నారు.

Updated Date - 2022-09-02T13:04:52+05:30 IST