నేటి అలంకారం శ్రీ దుర్గాదేవి ఆశ్వయుజ శుద్ధ అష్టమి

ABN , First Publish Date - 2022-10-03T08:11:59+05:30 IST

శరన్నవరాత్రుల్లో రాత్రుల్లో ఎనిమిదో రోజైన సోమవారం విజయవాడ కనకదుర్గమ్మ..

నేటి అలంకారం శ్రీ దుర్గాదేవి ఆశ్వయుజ శుద్ధ అష్టమి

(దుర్గాష్టమి)- సోమవారం


రన్నవరాత్రుల్లో రాత్రుల్లో ఎనిమిదో రోజైన సోమవారం విజయవాడ కనకదుర్గమ్మ... దుర్గతులను నివారించే శక్తి రూపమైన దుర్గాదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. లోక కంటకుడైన దుర్గమాసురుణ్ణి వధించి, ఇంద్రకీలాద్రిపై దుర్గగా... స్వయంభువై అమ్మవారు వెలసినది ఈ అష్టమి తిథి నాడేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ అష్టమిని ‘దుర్గాష్టమి’ అని వ్యవహరిస్తారు. పంచప్రకృతి మహాస్వరూపాల్లో దుర్గా రూపం మొదటిది. ఆమె శక్తి అనంతమైనది. దుర్గాదేవిది ఉగ్రరూపం. అయినా భక్తులపై ఆమె అవ్యాజమైన కరుణ కురిపిస్తుంది. ‘దుర్గే దుర్గతి నాశని’ అంటారు. ఈ రోజున అమ్మవారి దర్శనంతో దుర్గతుల నుంచి తప్పించుకోవచ్చనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. భవబంధాలలో చిక్కుకున్న మానవుణ్ణి దుర్గా మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుందనీ, కోటి సూర్యప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు తొలుగుతాయనీ, సర్వత్రా విజయం ప్రాప్తిస్తుందనీ పెద్దలు చెబుతారు.


నైవేద్యం: గారెలు, చిత్రాన్నం

అలంకరించే చీర రంగు: ఎరుపు

వేటితో అర్చించాలి: గులాబీలు, ఎర్రటిపూలు, కుంకుమ, ఎర్రటి అక్షతలు

పారాయణ: చెయ్యాల్సినవి: దుర్గా సూక్తం, దుర్గా సప్తశ్లోకీ

Updated Date - 2022-10-03T08:11:59+05:30 IST