నేడు మూడోవంతు దాటని వాక్సిన్
ABN , First Publish Date - 2021-01-22T06:40:39+05:30 IST
జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ వేసుకునేవారి సంఖ్య రోజు రోజుకీ తగ్గుతోంది.
చిత్తూరు రూరల్, జనవరి 21: జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ వేసుకునేవారి సంఖ్య రోజు రోజుకీ తగ్గుతోంది. వ్యాక్సిన్ కారణంగా ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురు కాకపోయినా హెల్త్ కేర్ వర్కర్లు మాత్రం వ్యాక్సినేషన్కు ముందుకు రావడం లేదు. గురువారం 57 కేంద్రాల్లో 4,429 మందికి వ్యాక్సిన్ వేయడానికి అధికారులు షెడ్యూలింగ్ చేయగా.. 1507మంది మాత్రమే వచ్చారు. ఎంత అవగాహన కల్పించినా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకున్నా హెల్త్ కేర్ వర్కర్లు ఆసక్తి చూపడం లేదు. వైద్య సిబ్బందే ఇలా వెనకడుగు వేస్తుండటం.. అధికారులకు తలనొప్పిగా మారింది.