నేటి నుంచి మల్లకంబ్ (పోల్పై యోగా) ఎంపిక పోటీలు
ABN , First Publish Date - 2021-09-19T05:09:43+05:30 IST
జిల్లా మల్లకంబ్ అసోసియేషన్ వారి నేతృత్వంలో మొట్టమొదటి రాష్ట్రస్థాయి మల్లకంబ్ చాంపియన్షిప్ ఎంపిక పోటీలను ఈనెల 19, 20 తేదీల్లో నిర్వహిస్తామని ఎల్హెచ్ భీమవరం టౌన్ హాల్ జాయింట్ సెక్రటరీ కామన నాగేశ్వరరావు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
భీమవరం రూరల్, సెప్టెంబరు 18 : జిల్లా మల్లకంబ్ అసోసియేషన్ వారి నేతృత్వంలో మొట్టమొదటి రాష్ట్రస్థాయి మల్లకంబ్ చాంపియన్షిప్ ఎంపిక పోటీలను ఈనెల 19, 20 తేదీల్లో నిర్వహిస్తామని ఎల్హెచ్ భీమవరం టౌన్ హాల్ జాయింట్ సెక్రటరీ కామన నాగేశ్వరరావు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక టౌన్ హాల్ ప్రాంగణంలో జరిగే ఎంపిక పోటీలకు పలు జిల్లాల నుంచి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలలో బాలబాలికలు సుమారు వంద మంది క్రీడాకారులు పాల్గొంటారన్నారు. ఈ మూడు విభాగాలలో ఎంపికైన క్రీడాకారులు ఈనెల 26 నుంచి 30 వరకు మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో రాష్ట్రం తరపున పాల్గొంటారన్నారు