నేడు ద్వితీయ వార్షికోత్సవం

ABN , First Publish Date - 2021-03-03T06:49:34+05:30 IST

మండలంలోని వెంగళాపురం గ్రామ సమీపంలోని గంగ సన్నిధిలో ప్రతిష్టించిన అభయాంజనేయ స్వామి వారి ద్వితీయ వార్షికోత్సవం బుధవారం నిర్వహిస్తున్నట్లు దేవస్థాన వ్యవస్థాపకులు కొంపల్లి మాలకొండయ్య తెలిపారు.

నేడు ద్వితీయ వార్షికోత్సవం

పీసీపల్లి, మార్చి 2: మండలంలోని వెంగళాపురం గ్రామ సమీపంలోని గంగ సన్నిధిలో ప్రతిష్టించిన అభయాంజనేయ స్వామి వారి ద్వితీయ వార్షికోత్సవం బుధవారం నిర్వహిస్తున్నట్లు దేవస్థాన వ్యవస్థాపకులు కొంపల్లి మాలకొండయ్య తెలిపారు. ఈ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం 8 గంటల నుంచి ఆంజనేయస్వామికి విశేష పూజలు నిర్వహించన్నుట్లు తెలిపారు. అనంతరం స్వామి వారి మూల మంత్రహోమం, అర్చన జపించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం అన్నదానం నిర్వహించనున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-03-03T06:49:34+05:30 IST