నేటి విద్యార్థులే రేపటి విజ్ఞానవేత్తలు
ABN , First Publish Date - 2021-02-28T05:06:40+05:30 IST
నేటి విద్యార్థులే రేపటి విజ్ఞానవేత్తలు అని డీవైఈవో రంగారెడ్డి పేర్కొన్నారు.
డీవైఈవో రంగారెడ్డి
రాయచోటి, ఫిబ్రవరి27: నేటి విద్యార్థులే రేపటి విజ్ఞానవేత్తలు అని డీవైఈవో రంగారెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముందస్తు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా హాజరైన డీవైఈవో విద్యార్థులు తయారు చేసిన సైన్స్మోడల్స్ను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేసి మాట్లాడారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కొండూరు శ్రీనివాసరాజు,ఎస్యంసీ చైర్మన్ యూసు్ఫఖాన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.