నేడు నగరానికి రాష్ట్ట్ర ఎన్నికల కమిషనర్
ABN , First Publish Date - 2021-03-01T05:59:50+05:30 IST
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ సోమవారం విశాఖ వస్తున్నారు.
ఉత్తర కోస్తా జిల్లాల అధికారులతో సదస్సు, రాజకీయ పార్టీలతో సమావేశం
విశాఖపట్నం, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ సోమవారం విశాఖ వస్తున్నారు. మునిసిపల్ ఎన్నికల నిర్వహణపై ఉత్తర కోస్తాకు చెందిన నాలుగు జిల్లాల అధికారులతో మఽధ్యాహ్నం కలెక్టరేట్లో సదస్సు నిర్వహిస్తారు. అనంతరం రాజకీయ పార్టీల నేతలతో సమావేశం అవుతారు. సాయంత్రం హైదరాబాద్ బయలుదేరి వెళతారు.