‘నాడు-నేడు’ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి : జేసీ

ABN , First Publish Date - 2021-06-23T06:16:19+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన ‘నాడు-నేడు’ పనులను త్వరి తగతిన పూర్తి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సిరి సంబంధిత అధికారులను ఆదేశిం చారు.

‘నాడు-నేడు’ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి : జేసీ
పాఠశాలలో పనులను పరిశీలిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సిరి

కంబదూరు, జూన 22: ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన ‘నాడు-నేడు’ పనులను త్వరి తగతిన పూర్తి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సిరి సంబంధిత అధికారులను ఆదేశిం చారు. మంగళవారం ఆమె మండలంలోని వైసీ పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో జరుగుతన్న పనులను పరిశీలించారు. పనులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఈఓ సాయికృష్ణ, ప్రధానోపాధ్యాయుడు సుధాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T06:16:19+05:30 IST