శ్రమ జీవులు రాజ్యాధికారం సాధించాలి
ABN , First Publish Date - 2022-09-28T05:52:45+05:30 IST
శ్రమజీవులైన బీసీ, ఎస్సీ, ఎస్టీలు రాజ్యాధికారం సాధించాలని డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మ హారాజ్ అన్నారు.
-డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్
ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 27: శ్రమజీవులైన బీసీ, ఎస్సీ, ఎస్టీలు రాజ్యాధికారం సాధించాలని డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మ హారాజ్ అన్నారు. 90 శాతం ఉన్న బీసీ,ఎస్సీ,ఎస్టీలకు రాజ్యాధికారం లేకపో వడం దారుణమన్నారు. మంగళవారం మండలంలోని తిమ్మాపూర్, వేము లకుర్తి, బర్తీపూర్ ఎర్దండి గ్రామాలలో 10 వేల కిలోమీటర్ల పాదయాత్ర సందర్భంగా ఆయా గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు ఉన్న ప్రతి వారికి రాజ్యంలో వాటా ఉండాలని విశారదన్ మహారాజ్ అన్నారు. తెలంగాణలో రెడ్డి, రావుల పా లనకు స్వస్తీ పలకాలన్నారు. డీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గంగరాజ్, నాయ కులు రమేష్, నరేష్, ఉమేష్, రంజిత్ పాల్గొన్నారు.