బంగారం పేరుతో మహిళకు టోకరా

ABN , First Publish Date - 2022-01-06T02:17:24+05:30 IST

బంగారం పేరుతో ఓ మహిళకు దుండగులు

బంగారం పేరుతో మహిళకు టోకరా

రంగారెడ్డి: బంగారం పేరుతో ఓ మహిళకు దుండగులు టోకరా వేశారు. వనస్థలిపురంలో పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మహిళాను గుర్తు తెలియని వ్యక్తులు ట్రాప్ చేశారు. తమ సొంత భూమిలో బంగారం దొరికిందని, తక్కువ రేటుకే ఇస్తాను అని ఆ మహిళను వీరబాబు అనే వ్యక్తి నమ్మించాడు. కొంచెం బంగారం ముక్క ఇచ్చి ఇది చూసుకోండి అని చెప్పి నిందితుడు పరారయ్యాడు. నకిలీ బంగారం అంటగట్టి రూ.2 లక్షల 30 వేలు రూపాయల నగదు తీసుకెళ్ళినట్లు యెలిశెట్టి నాగమణి ఫిర్యాదులో పేర్కొంది. నిందితులను పట్టుకోవడానికి సీసీ కెమెరాల ఫుటేజీలను వనస్థలిపురం పోలీసులు పరిశీలిస్తున్నారు. 


Updated Date - 2022-01-06T02:17:24+05:30 IST