
తిరుమల: కొవిడ్ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు గతంలో నిలిపివేసిన శ్రీవారి సర్వదర్శన ఆఫ్లైన్ టోకెన్ల జారీని 15వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. 16వ తేదీ దర్శనం కోసం 15వ తేదీ ఉదయం 9 గంటలకు టోకెన్లు జారీ చేస్తారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీగోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసే కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి టోకెన్లు పొందాలని టీటీడీ కోరింది. రోజుకు 10 వేల టోకెన్ల చొప్పున జారీ చేయనున్నారు.
ఇవి కూడా చదవండి