Tokyo Olympics: భారత్‌కు రెండో పతకం ఖాయం

ABN , First Publish Date - 2021-07-30T15:26:25+05:30 IST

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు రెండో పతకం ఖాయమైంది....

Tokyo Olympics:  భారత్‌కు రెండో పతకం ఖాయం

 సెమీస్‌కు చేరిన బాక్సర్ లవ్లీనా బొర్గోహెన్

టోక్యో (జపాన్): టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు రెండో పతకం ఖాయమైంది. టోక్యో ఒలింపిక్స్ లో యువ భారతీయ బాక్సర్ లవ్లీనా బొర్గోహెన్ శుక్రవారం మహిళల వెల్టర్ వెయిట్ విభాగంలో (64-69కిలోలు) చైనా తైపీకి చెందిన నీన్ చిన్ చెన్ పై విజయం సాధించారు. టోక్యోలో ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేసిన లవ్లిీనా సెమీఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనలిస్టులు ఇద్దరికి పతకం ఖాయమైనందున భారత్‌కు కనీసం కాంస్య పతకం లభిస్తుందని భరోసా ఇచ్చింది.బాక్సర్ లవ్లీనా బొర్గోహెన్ కు ఒలింపిక్స్ లో సెమీఫైనల్ కు చేరడం ద్వారా రెండో పతకం భారత్ కు ఖాయమైంది. మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్ రజత పతకం తర్వాత టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది రెండో పతకం.మాజీ వరల్డ్ చాంఫియన్ 4-1తో లవ్లీనా ఓడించింది.తొలి ఒలింపిక్స్ లోనే లవ్లీనా సంచలనం సృష్టించి భారతదేశానికి పేరు తెచ్చింది. అసోం రాష్ట్రంలోని గోలాఘాట్ ప్రాంతానికి చెందిన లవ్లీనా గతంలోనూ పలు పతకాలు సాధించింది. 


Updated Date - 2021-07-30T15:26:25+05:30 IST