టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో రేపటి నుంచి ఈడీ విచారణ

ABN , First Publish Date - 2021-08-30T18:18:27+05:30 IST

రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రేపటి(మంగళవారం) నుంచి ఈడీ విచారణ ప్రారంభంకానుంది.

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో రేపటి నుంచి ఈడీ విచారణ

హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న టాలీవుడ్ డ్రగ్స్  కేసులో రేపటి(మంగళవారం) నుంచి ఈడీ విచారణ ప్రారంభంకానుంది.  ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితుల నుంచి స్టేట్మెంట్‌‌ను రికార్డ్ చేసిన ఈడీ 12 మంది టాలీవుడ్‌ నటులకు నోటీసులు జారీ చేసింది. ఎక్సైజ్‌ శాఖ విచారించిన వారందరికీ నోటీసులు జారీ చేసే యోచనలో ఈడీ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 62 మందిని విచారించాలని ఈడీ నిర్ణయించింది. డ్రగ్స్‌ కేసులో మనీలాండరింగ్‌ జరిగినట్లు  ఈడీ గుర్తించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి భారీగా విదేశాలకు నిధులు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. రేపటి నుండి సెప్టెంబరు 22 వరకు సినీ తారలను విడతలవారిగా ఈడీ ప్రశ్నించనుంది. విచారణలో తేలే అంశాల ఆధారంగా సోదాలు లేదా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

Updated Date - 2021-08-30T18:18:27+05:30 IST