రేపు కేసీఆర్ కేబినెట్ అత్యవసర భేటీ.. లాక్‌డౌన్‌పై కీలక ప్రకటన

ABN , First Publish Date - 2021-06-19T02:28:44+05:30 IST

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం శనివారం జరగనుంది....

రేపు కేసీఆర్ కేబినెట్ అత్యవసర భేటీ.. లాక్‌డౌన్‌పై కీలక ప్రకటన

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం శనివారం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ అత్యసవరంగా భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగించాలా వద్దా..? లేకుంటే నైట్ కర్ఫ్యూ విధించాలా..? అనే దానిపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాకుండా వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయం సంబంధిత సీజనల్ అంశాలు, గోదావరిలో నీటిని లిఫ్టు చేసే అంశం, హైడల్ పవర్ ఉత్పత్తితో పాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.


రేపు తేలిపోతుంది..!

కాగా.. ఇవాళ కూడా ప్రగతి భవన్‌లో మంత్రులతో కీలక భేటీనే జరిగింది. మంత్రులు హరీశ్‌రావు, మహామూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్‌లు హాజరైన ఈ సమావేశంలో లాక్ డౌన్ సడలింపులు, ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలలతో పాటు హుజూరాబాద్ అభ్యర్థిపై కూడా కీలకంగానే చర్చించినట్లు తెలుస్తోంది. అయితే.. లాక్‌డౌన్ ఇవాళ ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన ఉంటుందని అందరూ అనుకున్నప్పటికీ ఎలాంటి ప్రకటన రాలేదు. శనివారం నాడు మరోసారి భేటీ అయ్యి లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో జూన్ 19తో లాక్‎డౌన్ ముగియనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లాక్‌డౌన్ ఉంది. అయితే శనివారం చేయబోయే ప్రకటన ఎలా ఉంటుందన్న దానిపై రాష్ట్ర ప్రజానికంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Updated Date - 2021-06-19T02:28:44+05:30 IST