రేపు కర్నూలుకు మున్సిపల్‌ మంత్రి రాక

ABN , First Publish Date - 2022-05-15T13:57:59+05:30 IST

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ 16న కర్నూలుకు రానున్నారు.

రేపు కర్నూలుకు మున్సిపల్‌ మంత్రి రాక

కర్నూలు : రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ (Audimulapu Suresh) 16న కర్నూలుకు  రానున్నారు. ఉదయం 9.15 గంటలకు సీ.క్యాంపులోని క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. కల్లూరు అర్బన్‌ పరిధిలోని 19, 34, 35, 36, 37, 41 వార్డులో రూ.9.04 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 2వ వార్డు ఎర్రబురుజు సమీపంలో, 6వ వార్డు గడ్డ వీధిలో ఒక్కొక్కటి కోటి రూపాయలతో నిర్మించిన  నూతన అర్బన్‌ హెల్త్‌ సెంటర్లను ప్రారంభించనున్నారు. అనంతరం నూతన కౌన్సిల్‌ హాల్‌లో కార్పొరేటర్లతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కర్నూలు, నంద్యాల ఎంపీలు డా. సంజీవ్‌కుమార్‌, పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్‌, కమిషనర్‌ ఏ. భార్గవతేజ హాజరు కానున్నారు.

Updated Date - 2022-05-15T13:57:59+05:30 IST