రేపు టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి
ABN , First Publish Date - 2021-01-17T05:41:01+05:30 IST
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ వర్ధంతిని సోమవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని పార్టీ కర్నూలు లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు.
కర్నూలు(అగ్రికల్చర్), జనవరి 16: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ వర్ధంతిని సోమవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని పార్టీ కర్నూలు లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళి అర్పించిన అనంతరం కలెక్టరేట్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటిస్తామని తెలిపారు. గౌరీగోపాల్ హాస్పిటల్ అక్షయ బ్లడ్ బ్యాంకులో రక్తదానం శిబిరం ఉంటుందని, కార్యకర్తలు, నాయకులు హాజరుకావాలని కోరారు.