రేపు జంటనగరాల TRS సర్వసభ్య సమావేశం
ABN , First Publish Date - 2021-09-06T14:13:00+05:30 IST
టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల
హైదరాబాద్ సిటీ/ఖైరతబాద్ : టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల సర్వసభ్య సమావేశం ఈనెల 7న పీవీ నర్సింహారావు మార్గంలోని జలవిహార్లో జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం ఆయన పార్టీ నాయకులతో కలసి జలవిహార్లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సమావేశంలో మంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్, కార్పోరేటర్లు, పదాధికారులు పాల్గొంటారన్నారు. మంత్రి కేటీఆర్ హాజరవుతారని వివరించారు. జంట నగరాల్లో ఇప్పటికే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసిందని, 60 లక్షల మంది సభ్యత్వంతో దేశంలోనే పార్టీ ప్రత్యేకమైన స్థానాన్ని కైవసం చేసుకున్నదని అన్నారు. మంత్రి వెంట నాయకులు గుర్రం పవన్ కుమార్ గౌడ్, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, సామా ప్రభాకర్ రెడ్డి, ఆకుల హరికృష్ణ, నరేందర్ నాయీ, ఎంఎన్ శ్రీనివాస్ ఉన్నారు.