జిల్లావ్యాప్తంగా మొత్తం మరణాలు 700

ABN , First Publish Date - 2021-04-17T05:30:00+05:30 IST

జిల్లావ్యాప్తంగా మొత్తం మరణాలు 700

జిల్లావ్యాప్తంగా మొత్తం మరణాలు 700

శనివారం ఒక్కరోజే 493 మందికి వైరస్‌

ఒకరు మృతి

విజయవాడ, ఆంధ్రజ్యోతి : కరోనా ఉగ్రరూపం దాల్చింది. శనివారం ఒక్కరోజే జిల్లావ్యాప్తంగా 493 మందికి వ్యాపించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో బాధితుడిని బలి తీసుకుంది. దీంతో జిల్లాలో మొత్తం మరణాల సంఖ్య 700కు చేరింది. పాజిటివ్‌  కేసుల సంఖ్య 54,666కు చేరింది. 3,875 మంది బాధితులు కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 50,091 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.  

Updated Date - 2021-04-17T05:30:00+05:30 IST