సప్త గుండాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం
ABN , First Publish Date - 2020-11-30T04:55:05+05:30 IST
సప్త గుండాల జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.
-కలెక్టర్ రాహుల్ రాజ్
లింగాపూర్, నవంబరు29: సప్త గుండాల జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. లింగాపూర్ మండలంలోని సప్తగుండాల జలపాతాన్ని కలెక్టర్ ఆదివారం సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సందర్శకులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వ పరంగా అన్ని వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట అటవీ అధికారి రవి కుమార్, తహసీల్దార్ హీరాలాల్, ఎస్సై మధుకర్ ఉన్నారు.