ఘట్కేసర్లో Revanth reddy అరెస్ట్
ABN , First Publish Date - 2022-06-18T18:36:22+05:30 IST
జిల్లాలోని ఘట్కేసర్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.
మేడ్చల్: జిల్లాలోని ఘట్కేసర్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన రాకేష్ కుంటుంబాన్ని పరామర్శించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth reddy) బయలుదేరారు. కాగా ఘట్కేసర్లో రేవంత్రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. టీపీసీసీ చీఫ్ సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. రేవంత్ను పోలీస్స్టేషన్కు తరలిస్తున్న వాహనాన్ని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
మరోవైపు అగ్నిపథ్ ఆందోళనలో మృతి చెందిన రాకేష్ అంతిమయాత్ర ఉద్రిక్తంగా మారింది. వరంగల్లో అంతిమయాత్ర జరుగుతున్న సమయంలో పోచం మైదాన్(Pocham Maidan) కూడలిలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంపై ఆందోళనకారులు దాడి చేశారు. నల్లజెండాలతో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. బీఎస్ఎన్ఎల్ కార్యాలయం బోర్డుకి నిప్పు పెట్టారు. పోచం మైదాన్ కూడలి మీదుగా రాకేష్ అంతిమ యాత్ర సాగింది.