ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్‌ను ఏం చేయలేరు: Revanth

ABN , First Publish Date - 2021-12-28T17:55:52+05:30 IST

కాంగ్రెస్ పార్టీకి 137 ఏళ్ల చరిత్ర ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు.

ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్‌ను ఏం చేయలేరు: Revanth

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి 137 ఏళ్ల చరిత్ర ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రేవంత్ మాట్లాడుతూ కొందరు కాంగ్రెస్ గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్‌ను ఏం చేయలేరని తేల్చిచెప్పారు. పాలకులు యువతకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని విమర్శించారు. దేశంలో మళ్లీ పూర్వ వైభవం రావాలంటే దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. మోదీకి కుటుంబ, పిల్లలు లేరు.. ఆయనకు ఏం తెలుసు అని ప్రశ్నించారు. మతతత్వ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-12-28T17:55:52+05:30 IST