వడ్డీతో సహా చెల్లిస్తాం: రేవంత్రెడ్డి
ABN , First Publish Date - 2022-01-26T00:05:19+05:30 IST
తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని టీపీసీసీ
నారాయణపేట: తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. జిల్లాలోని కొడంగల్లో ఆయన మాట్లాడారు. కొందరు పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అభివృద్ధిపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. కొడంగల్లో తాను చేసిన అభివృద్ధి తప్ప టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎక్కడా అభివృద్ధి చేయలేదని ఆయన పేర్కొ్నారు. కొడంగల్ అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధంమని ఆయన ప్రకటించారు. సారా తాగే సన్యాసి, కొడంగల్ను దత్తత తీసుకున్న దరిద్రుడు ఎక్కడా ఉన్నారని ఆయన ప్రశ్నించాడు.